AP: రాష్ట్రంలో మరో విషాదం చోటుచేసుకుంది. కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం విలస గ్రామంలోని కిరాణా షాపులో పేలుడు సంభవించి భార్యాభర్తలు మృతి చెందారు. దీపావళి పండుగ కోసం నిల్వ చేసిన ఫైర్వర్క్స్ పేలుడుతో ఈ సంఘటన జరిగింది. దీంతో భార్యాభర్తలు స్పాట్లోనే మృతి చెందారు. కుమారుడికి తీవ్ర గాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు.
మృతులు కంచర్ల శ్రీనివాసరావు, సీత గుర్తించారు.