ఉగాండాలో పెటర్నిటీ ఫ్రాడ్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. DNA పరీక్షల్లో తమ పిల్లలు తమవారు కాదని తెలిసి పురుషులు షాక్కు గురవుతూ ల్యాబ్లకు పరుగులు పెడుతున్నారు. ఒక ధనవంతుడి ముగ్గురు పిల్లలు తనవారు కాదని తేలడం, విదేశీ వీసాల కోసం DNA తప్పనిసరి కావడం సమస్యను మరింత పెంచాయి. ఈ డిమాండ్తో నకిలీ DNA ల్యాబ్లు ఏర్పడి తప్పుడు రిపోర్టులు ఇస్తుండడంతో కుటుంబాల్లో అనుమానాలు, విభేదాలు పెరుగుతున్నాయి.