కార్తీక పౌర్ణమి శివకేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ఈ పౌర్ణమి రోజున 365 ఒత్తులను ఆవు నెయ్యిలో పెట్టి తులసి చెట్టు వద్ద లేదా దేవాలయంలో వెలిగించడం వల్ల సంవత్సరం పొడవునా దీపాలు వెలిగించిన పుణ్యం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి నాడు దీపాలు వెలిగించడం ద్వారా గత జన్మల పాపాలు తొలగిపోతాయని విశ్వాసం.