
యువతలో పెట్టుబడిపై పెరిగిన ఆసక్తి
గతంలో ఉద్యోగం వచ్చాకే పెట్టుబడుల గురించి ఆలోచించేవారు, కానీ నేటి జెన్-జీ యువత ఇరవై ఏళ్లకే స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, సిప్ (SIP)ల గురించి చర్చిస్తున్నారు. ఆర్థిక అవగాహన పెరగడం, సోషల్ మీడియా ప్రభావంతో పెట్టుబడి సామాన్యుల సంభాషణల్లో భాగమైంది. కోవిడ్-19 మహమ్మారి, ఆన్లైన్ సమాచారం అందుబాటులోకి రావడం వల్ల జనవరి 2023 నుండి ఆగస్టు 2024 మధ్య 6 కోట్లకు పైగా కొత్త డీమాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. 2025 నాటికి డీమాట్ ఖాతాదారుల్లో 30 ఏళ్లలోపు వారే ఎక్కువ ఉంటారని అంచనా. అయితే అతిగా ఉన్న ఆన్లైన్ సమాచారంలో నిజానిజాలు తెలుసుకోవడం యువతకు కష్టమవుతోంది.




