దేశంలో దాదాపు 60 శాతం మంది అమ్మాయిలూ, మహిళలూ, పిల్లలూ రక్తహీనతతో బాధపడుతున్నారని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. ఈ సమస్యను సులువుగా తగ్గించాలనుకుంటే ఆరోగ్యసిరుల బీట్రూట్ సరైన ఔషధమని నిపుణులు చెబుతున్నారు. ఐరన్ రిచ్ ఫుడ్గా పేరొందిన బీట్రూట్, తక్కువ సమయంలోనే హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడమే కాదు, శరీరానికి కావాల్సిన పోషకాలెన్నో అందిస్తుంది. ఏడాది పొడవునా, మన బడ్జెట్లో అందుబాటులో ఉండే ఈ బీట్రూట్ని తింటే చాలని వివరిస్తున్నారు.