ముంబైలోని గోరేగావ్లో శుక్రవారం ఆదర్శ్ విద్యాలయం వద్ద షాకింగ్ సంఘటన జరిగింది. ఆదర్శ్ విద్యాలయంలో డ్యూటీలో ఉన్న సెక్యూరిటీ గార్డుపై ఓ వీధి కుక్క అకస్మాత్తుగా వచ్చి దాడి చేసి కరిచింది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి కుక్కలపై కర్రతో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ కావడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.