ఉత్తరప్రదేశ్లోని బరేలీ ఇజ్జత్నగర్లో బాలుడిపై కుక్కలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ట్యూషన్కు వెళ్తున్న ఒక చిన్నారిపై ఓ పెంపుడు కుక్క, వీధి కుక్క దాడి చేశాయి. పెంపుడు కుక్కను వాకింగ్కు తీసుకెళ్లిన టీచర్ తల్లి దాడిని ఆపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ఘటనలో పోలీసులు సదరు ఉపాధ్యాయుడితో పాటు ఆమె తల్లిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.