దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చమురు ధరల పెరుగుదల, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సెన్సెక్స్ 416 పాయింట్లు కోల్పోయి 76,886 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 97 పాయింట్లు నష్టపోయి 23,995 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ 41 పైసలు పడిపోయి 94.56కు చేరింది. ఓఎన్జీసీ, అదానీ ఎంటర్ప్రైజెస్ వంటి షేర్లు రాణించగా, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ వంటివి నష్టపోయాయి.