TG: ప్రజాస్వామ్య దేశంలో జనాభా లెక్కల సేకరణ గొప్ప కార్యక్రమమని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం స్వీయ ధ్రువీకరణ చేసుకున్న ఆయన, జనగణనలో తొలిసారి కులగణన జరుగుతోందని తెలిపారు. సంక్షేమ పథకాలు తొలగిస్తారనే భయం వద్దని, అందరూ ధైర్యంతో వివరాలు ఇవ్వాలని కోరారు. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఎస్ఐఆర్ను అభినందిస్తూ, దీనివల్ల నకిలీ ఓట్లు తగ్గి పోలింగ్ శాతం పెరుగుతుందని చెప్పారు.