కొందరు పాడి రైతులు పశువుల నుంచి పాలు తీసేటప్పుడు పొదుగులో కొంత పాలను వదిలేస్తారు. దీని వల్ల అందులో చేరే బాక్టీరియా పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే, పొదుగుకు చిన్న గాయాలైనప్పుడు సకాలంలో చికిత్స అందించకపోతే, ఇన్ఫెక్షన్ వ్యాపించి ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వారు తెలిపారు. పశువుల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.