ఆయిల్ ఫుడ్ తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలు, డ్రింక్స్ తీసుకోకూడదని వైద్య నిపుణులు సూచస్తున్నారు. ఈ మేరకు ఐస్ క్రీమ్స్, స్వీట్స్, ఫ్రూట్స్, కూల్ డ్రింక్స్ వంటివి తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని అంటున్నారు. దీనివల్ల జీర్ణ ప్రక్రియ మందగించి, లివర్ పై ఒత్తిడి పెరిగి, కడుపులో గ్యాస్, పుల్లటి తేన్పులు, అజీర్తి, గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయని తెలిపారు. ఆయిల్ ఫుడ్స్ తర్వాత మజ్జిగ లేదా గ్రీన్ టీ తాగడం ఉత్తమమని సూచించారు.