ప్రముఖ నటి ఐశ్వర్యరాయ్ ఫొటోలు వాడొద్దని ఢిల్లీ హైకోర్టు గురువారం తీర్పు ఇచ్చింది. అనుమతి లేకుండా తన ఫొటోలు, వీడియోలను చట్టవిరుద్ధంగా వాడుతున్నారని, తన వ్యక్తిగత గోప్యతా హక్కును పరిరక్షించాలని ఐశ్వర్యరాయ్ ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు తనపేరు, చిత్రాలను ఏఐ ఆధారిత అశ్లీల కంటెంట్లో అనధికారికంగా వాడుతున్నారని, వాటిని ఉపయెగించకుండా నిరోధించాలని కోరగా హైకోర్టు ఈ తీర్పును తీర్పునిచ్చింది.