
టికెట్ ధరల నియంత్రణపై ఉన్నతస్థాయి సమీక్ష
విమాన టికెట్ ధరల నియంత్రణపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో డీజీసీఏ అధికారులు, పలు విమానయాన సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. కరోనా సమయంలో మాదిరిగానే ఇప్పుడు కూడా ధరలు నియంత్రించాలని నిర్ణయించారు. కాసేపట్లో వివిధ రూట్లలో ధరల నిర్ణయాన్ని పౌరవిమానయాన శాఖ వెలువరించనుంది.




