కాసేపట్లో నూతన సంవత్సరానికి భారత్ వెల్కమ్ చెప్పనుంది. ఈ న్యూఇయర్ వేడుకల్లో భాగంగా పలువురు మద్యంలో మునిగి తేలనున్నారు. ఈ మేరకు వైన్ షాపుల వద్ద మందుబాబులు బారులు తీరారు. మరోవైపు, వీరి దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు పోలీసులు 7 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా KPHB ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైనా పట్టుబడితే ఉపేక్షించేది లేదని, వాహనాలు సీజ్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు.