హైదరాబాద్లోని సరూర్నగర్లో పోలీసులు చేపట్టిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా మద్యం సేవించి వాహనం నడుపుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరించినప్పటికీ, అతనిపై కేసు నమోదు చేసి, వాహనాన్ని సీజ్ చేశారు. అర్ధరాత్రి వరకు తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మద్యం సేవించినప్పుడు క్యాబ్ లేదా ఆటోను ఉపయోగించుకోవాలని సూచించారు.