ఆసియా కప్ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరుగుతున్న సూపర్-4 మ్యాచ్లో పాకిస్తాన్ నాలుగో వికెట్ కోల్పోయి కష్టాల్లో పడింది. దూకుడుగా ఆడుతున్న పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 58 పరుగులకు ఔట్ అయ్యాడు. శివమ్ దూబే వేసిన 14.1 ఓవర్కు సూర్యకుమార్ యాదవ్కు ఇచ్చి ఫర్హాన్ పెవిలియన్ చేరాడు. దీంతో 15 ఓవర్లకు పాక్ స్కోర్ 119/4గా ఉంది. క్రీజులో మహ్మద్ నవాజ్ (6), సల్మాన్ అఘా (2) పరుగులతో ఉన్నారు.