దేశవాళీ ప్రతిష్టాత్మక టోర్నీ దులీప్ ట్రోఫీ గురువారం (ఆగస్టు 28) నుంచి ప్రారంభం కానుంది. బెంగళూరులో మొదలయ్యే ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు తలపడనున్నాయి. నార్త్ జోన్, సౌత్ జోన్, ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, సెంట్రల్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు టైటిల్ కోసం పోరాడనున్నాయి. ప్రారంభ మ్యాచ్లో నార్త్ జోన్ ఈస్ట్ జోన్తో తలపడుతుంది. సెంట్రల్ జోన్ క్వార్టర్ ఫైనల్స్లో నార్త్ ఈస్ట్ జోన్తో తలపడుతుంది.