గాయత్రీ దేవిగా విజయవాడ కనక దుర్గమ్మ

8403చూసినవారు
గాయత్రీ దేవిగా విజయవాడ కనక దుర్గమ్మ
దేవీ నవరాత్రులలో రెండవ రోజు, ఆశ్వయుజ శుక్ల తదియ నాడు, విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనక దుర్గమ్మ శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఆదిశంకరాచార్యులు ఆరాధించిన ఈ దేవిని దర్శించడం వల్ల మనసు పులకితమవుతుందని, సిరి సంపదలకు లోటు ఉండదని భక్తులు విశ్వసిస్తున్నారు. గాయత్రీ దేవి పంచముఖాలు పంచభూతాలకు ప్రతీక. ఈ రోజు గాయత్రీ కవచం చదవడం అత్యంత ఫలవంతం. అమ్మవారికి తామర లేదా కలువ పువ్వులను సమర్పించి, చలిమిడి, వడపప్పు, పానకం, కొబ్బరి అన్నం, అల్లపు గారెలను నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారు కంటికి రెప్పలా కాపాడుతారని భక్తుల నమ్మకం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్