ప్రపంచకప్‌ గెలిచిన ఒక్కో పంజాబీ క్రీడాకారిణికి రూ. 11 లక్షల రివార్డ్

0చూసినవారు
ప్రపంచకప్‌ గెలిచిన ఒక్కో పంజాబీ క్రీడాకారిణికి రూ. 11 లక్షల రివార్డ్
ప్రపంచకప్‌ విజయంలో పంజాబ్‌ క్రీడాకారుల కృషిని గుర్తిస్తూ పంజాబ్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ బహుమతి ప్రకటించింది. జట్టులో ఉన్న ప్రతి పంజాబీ క్రీడాకారిణికి రూ.11 లక్షల చొప్పున నగదు రివార్డ్‌ అందజేయనున్నట్లు తెలిపింది. దీంతో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, ఆల్‌రౌండర్‌ అమన్‌జ్యోత్‌ కౌర్‌లకు ఈ నజరానా లభించనుంది. అంతేకాకుండా జట్టులో ఫీల్డింగ్‌ కోచ్‌గా ఉన్న మునీష్‌ బాలి రూ.5 లక్షల బహుమతి అందుకోనున్నారు.

సంబంధిత పోస్ట్