
రేవంత్ ప్రభుత్వం విజన్తో ముందుకెళ్తోంది.. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
‘తెలంగాణ రైజింగ్’ గ్లోబల్ సమ్మిట్-2025 వైభవోపేతంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. వికసిత్ భారత్-2047లో తెలంగాణ రైజింగ్ ఒక భాగమని, లక్ష్యాలకు అనుగుణంగా తెలంగాణ ముందుకు వెళ్తోందని అన్నారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ ఎదగాలని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అన్ని రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం విజన్తో ముందుకు వెళ్తోందని తెలిపారు.




