ఫాల్కన్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఈడీ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. రూ.791 కోట్ల మోసం జరిగినట్లు గుర్తించింది. యాప్ బేస్డ్ పెట్టుబడుల పేరుతో భారీగా వసూళ్లు రాబట్టినట్లు ఛార్జ్షీట్లో పేర్కొంది. దేశవ్యాప్తంగా రూ.3 వేల కోట్ల మోసాలు జరిగినట్లు ఈడీ తెలిపింది. వసూలు చేసిన డబ్బుతో నిందితులు సొంత ఆస్తులు, చార్టర్డ్ ఫ్లైట్లు కొనుగోలు చేసినట్లు వెల్లడించింది.