కేరళ సీఎం పినరయి విజయన్కు బిగ్ షాక్ తగిలింది. కేఐఐఎఫ్బీ మసాలా బాండ్ కేసులో ఆయనతో, మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇస్సాక్, సీఎం ప్రధాన కార్యదర్శి కేఎం అబ్రహంలకు ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) నోటీసులు జారీ చేసింది. రూ.468 కోట్ల ట్రాన్సాక్షన్స్ లో ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘించారనే ఆరోపణలపై వివరణ ఇవ్వాలని పేర్కొంది. మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులు సమీకరించే ప్లాన్లో భాగంగా ఈ బాండ్లను జారీ చేశారు.