ఎల్‌నినో ప్రభావం.. వర్షపాతం లోటుతో ధరల మంట తప్పదా?

13చూసినవారు
ఎల్‌నినో ప్రభావం.. వర్షపాతం లోటుతో ధరల మంట తప్పదా?
భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం, ఈ ఏడాది నైరుతి రుతుపవనాల్లో 10% లోటు ఏర్పడే అవకాశం ఉంది. దీనివల్ల దేశ ఆహార ద్రవ్యోల్బణం తీవ్రతరం అవుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎల్‌నినో ప్రభావం, పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల పంటల దిగుబడి తగ్గి, టొమాటోలు, ఉల్లిపాయలు, పాలు, తృణధాన్యాల ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉంది. గత 25 ఏళ్లలో 7 ఎల్‌నినో పరిస్థితుల్లో 6 సార్లు తక్కువ వర్షపాతం నమోదైంది. ఇప్పటికే మే నెలలో టొమాటో ధరలు 34% పెరిగాయి. రాబోయే రోజుల్లో వర్షాలు తగ్గితే ఈ ధరలు మరింత పెరగనున్నాయి.