
అత్తతో వివాహేతర సంబంధం.. అడ్డు వచ్చిందని భార్యను చంపేసిన భర్త
ఉత్తర్ ప్రదేశ్లోని కాస్గంజ్లో అత్తతో వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందని భర్త ప్రమోద్ తన భార్య శివానిని (20) హత్య చేశాడు. ఈ హత్యలో అత్త కూడా సహకరించినట్లు తెలుస్తోంది. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శివాని మృతదేహాన్ని పోస్ట్మార్టంకు తరలించారు. ఈ హత్య తర్వాత ప్రమోద్, అతని అత్తకు సంబంధించిన అసభ్యకరమైన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, వివాహేతర సంబంధం కారణంగానే ఈ హత్య జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నారు.




