బస్సుల్లో అత్యవసర ద్వారాలు తప్పనిసరి చేయాలి: సోనూసూద్

12664చూసినవారు
బస్సుల్లో అత్యవసర ద్వారాలు తప్పనిసరి చేయాలి: సోనూసూద్
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వి.కావేరీ బస్సుకు కర్నూలులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 19 మంది మరణించిన నేపథ్యంలో, నటుడు సోనూసూద్ కేంద్ర ప్రభుత్వానికి కీలక విజ్ఞప్తి చేశారు. ప్రతి లగ్జరీ బస్సులో ఎలక్ట్రానిక్ తలుపులతో పాటు మాన్యువల్ ఎమర్జెన్సీ డోర్ తప్పనిసరి చేయాలని, దీనిని చట్టం చేయాలని ఆయన కోరారు. రెండు వారాల్లోనే సుమారు 40 మంది ప్రాణాలు కోల్పోవడం భద్రతా ఆందోళనలను పెంచిందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్