ఇంగ్లండ్తో మ్యాచ్తో టెస్టుల్లోకి అరంగ్రేటం చేసిన టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ నిరాశపర్చాడు. నాలుగు బంతులు ఎదుర్కొని బెన్ స్టోక్స్ బౌలింగ్లో వికెట్ కీపర్ జెమీ స్మిత్కు క్యాచ్ ఇచ్చి డకౌట్గా వెనుదిరిగాడు. దీంతో 92 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. అంతకుముందు ఓవర్లో బ్రైడన్ కార్స్ బౌలింగ్ కేఎల్ రాహుల్ (42) ఔట్ అయ్యాడు. ఈ క్రమంలో లంచ్ విరామం ప్రకటించారు. యశస్వి (42*) పరుగులతో క్రీజులో ఉన్నాడు.