ఉద్యోగుల పింఛను నిధి పథకం (ఈపీఎస్) ఆదాయం పెరుగుతున్నా, లబ్ధిదారులు కనీస పింఛను పెంపునకు నోచుకోక అవస్థలు పడుతున్నారు. ఈపీఎస్-95 పథకానికి చెందిన వేలాది మంది పింఛనుదారులు కనీస పింఛను మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.7,500కు పెంచాలని ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. ఈ అంశాన్ని తాజాగా పార్లమెంట్లోనూ ఓ సభ్యుడు లేవనెత్తారు. అయితే, పెన్షన్ పెంచే ప్రతిపాదనేదీ లేదని తాజాగా కార్మికశాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే వెల్లడించారు.