భారతదేశంలో ఎగ్జిట్ పోల్ సర్వేలు 1996లో CSDS సంస్థ ద్వారా మొదలయ్యాయి, దూరదర్శన్ ప్రసారం చేసింది. 1996 పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా వేసింది. ప్రపంచంలో తొలి ఎగ్జిట్ పోల్స్ 1930లో అమెరికాలో జరిగాయి. 1982లో అమెరికాలో వివాదం తర్వాత, పోలింగ్ ముగిశాకే సర్వేలు విడుదల చేయాలనే నిబంధన వచ్చింది. భారతదేశంలో ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, సెక్షన్ 126A ప్రకారం పోలింగ్కు ముందు ఎగ్జిట్ పోల్స్ ఇవ్వడం నేరం.