పంజాబ్లోని పాటియాలా జిల్లా రాజ్పురా - శంభు మధ్య రైల్వే ట్రాక్పై సోమవారం రాత్రి స్వల్ప తీవ్రతతో కూడిన పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. పేలుడు ధాటికి గుర్తుతెలియని ఆ వ్యక్తి మృతదేహం పూర్తిగా ఛిద్రమై పడి ఉంది. బాంబును అమర్చడానికి ప్రయత్నిస్తుండగా అది హఠాత్తుగా పేలి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికంగా పెను కలకలం రేగింది.