తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ బుధవారం కీలక హెచ్చరికలు జారీ చేసింది. కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, MBBD, వరంగల్ జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని, ఆయా జిల్లాలకు 'ఆరెంజ్' అలర్ట్ ప్రకటించింది. ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రాకూడదని అధికారులు సూచించారు.