అభిమాని హత్య కేసు.. దర్శన్‌, పవిత్రపై నేరాభియోగాలు

0చూసినవారు
అభిమాని హత్య కేసు.. దర్శన్‌, పవిత్రపై నేరాభియోగాలు
తన అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌, ఆయన స్నేహితురాలిపై బెంగళూరు సెషన్స్ కోర్టు నేరాభియోగాలు నమోదు చేసింది. మొత్తం 17 మంది నిందితులు తాము ఏ తప్పూ చేయలేదని న్యాయస్థానం ముందు తెలిపారు. కోర్టు గది నిండిపోవడంపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేస్తూ, సంబంధంలేని న్యాయవాదులను బయటకు వెళ్లాలని ఆదేశించారు. నవంబర్ 10కి తదుపరి విచారణ వాయిదా పడింది. అనంతరం దర్శన్‌, పవిత్ర, ఇతర నిందితులను జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్