సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ 2: తాండవం' సినిమా విడుదల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో కొందరు అభిమానులు మాన్షన్ హౌస్ మందు బాటిల్తో సినిమాకు దిష్టి తీసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సినిమా చూసిన అనంతరం బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్కు దిష్టి తీశామని, ఎవరికీ దిష్టి తగలకుండా ఉండాలనే ఉద్దేశ్యంతో అలా చేశామని వారు తెలిపారు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు జరగడంతో, ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.