ఆసియా కప్లో భాగంగా దుబాయ్ వేదికగా ఆదివారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్లో పాక్ బ్యాటర్ సాహిబ్జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేశాడు. ఫర్హాన్ దూకుడుగా ఆడుతూ 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సులతో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. అక్షర్ పటేల్ వేసిన 10 ఓవర్లో మూడో బంతికి సిక్స్ కొట్టి ఫర్హాన్ అర్ధ శతకం సాధించాడు. అనంతరం బ్యాట్ను AK-47 గన్లా పట్టుకుని గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లు యాక్షన్ చేసి హాఫ్ సెంచరీని సెలెబ్రేట్ చేసుకున్నాడు.