చిల్లర నాణేలతో కూతురికి స్కూటర్‌ కొన్న రైతు.. వీడియో

37437చూసినవారు
ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పూర్ జిల్లాకు చెందిన రైతు బజరంగ్ రామ్ భగత్ తన కూతురికి దీపావళి కానుకగా లక్ష రూపాయల విలువైన స్కూటర్‌ను కొనిచ్చారు. ఈ కలను నెరవేర్చుకోవడానికి ఆయన గత 6 నెలలుగా కష్టపడి డబ్బు ఆదా చేశారు. షోరూమ్‌కు వెళ్లి దాదాపు 40,000 రూపాయలను నాణేల రూపంలో చెల్లించడంతో అక్కడి సిబ్బంది ఆశ్చర్యపోయారు. షోరూమ్ యజమాని, సిబ్బంది ఓపికగా నాణేలను లెక్కించి, రైతుకు స్కూటర్‌ను అందజేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

సంబంధిత పోస్ట్