TG: ఎరువుల విషయంలో రైతులు ఆందోళన చెందొద్దని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. రైతులు ఇంటివద్దే ఉండి ఎరువులను యాప్ ద్వారా బుక్ చేసుకుంటున్నారని, పారదర్శకంగా ఎరువులు ఇస్తున్నామని తెలిపారు. తాము ఎప్పుడూ రైతుల గురించే ఆలోచిస్తామన్నారు. ఇటీవల కేంద్రమంత్రిని కలిసి ఎరువులు ఇవ్వాలని కోరామని, పశ్చిమాసియా సంక్షోభంలో కూడా సకాలంలో ఎరువులు సరఫరా చేశామని గుర్తుచేశారు.