యూపీలోని ఆగ్రాలోని మంసూఖ్పుర పీఎస్ పరిధిలో షాప్రి నగర్ ట్రై జంక్షన్లో మట్టి లోడ్తో వెళ్తున్న ఓవర్ లోడ్ ట్రక్కు బైక్ను ఢీకొనడంతో భార్యాభర్తలు, కుమార్తె అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రామ్ సేవక్ (40), అనితా దేవి (35), కుమార్తె డాలీ (10)గా గుర్తించారు. అనిత నాలుగు నెలల గర్భవతి. ట్రక్కు బైక్ను దాదాపు 600 మీటర్లు లాక్కెళ్లిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి, పారిపోయిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. వాహనాలను స్వాధీనం చేసుకుని, పూర్తి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.