యూపీలోని ఘజియాబాద్లో విషాద ఘటన చోటు చేసుకుంది. లాల్కువాన్ ప్రాంతంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక మహిళా కానిస్టేబుల్ అక్కడికక్కడే మృతి చెందారు. ట్రక్ ఆమె స్కూటర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. కవినగర్ పోలీస్ స్టేషన్లో పనిచేసిన ఆమె, ప్రస్తుతం దాద్రీ PSలో విధులు నిర్వహిస్తోంది. తన భర్తతో విడిపోయిన ఆ మహిళ, తన ఇద్దరు పిల్లలైన విరాట్ (7), మహి (5)లను తన తల్లి సహాయంతో పెంచుకుంటుంది.