పశ్చిమ బెంగాల్లోని నార్త్ 24 పరగణాల జిల్లాలో మంగళవారం రాత్రి ఒక దారుణం జరిగింది. భార్యతో గొడవ పడిన పింటూ ఘోష్ అనే వ్యక్తి, తన పదేళ్ల కొడుకుని భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో వదిలిపెట్టి వెళ్లిపోయాడు. స్థానికులు బాలుడిని గుర్తించి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించి, వారిద్దరికీ కౌన్సెలింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.