కొడుకు భవిష్యత్తు కోసం ఓ తండ్రి చేసిన సాహసం చేశాడు. స్వయంగా 800 KM కారు నడిపి.. సమయానికి కొడుకును పరీక్షకు అందించాడు. ఢిల్లీ నుంచి ఇండోర్ కు వెళ్లే ఇండిగో విమానం రద్దవడంతో కొడుకు 12th పరీక్ష మిస్ అవుతుందని సదరు విద్యార్థి తండ్రి ఆందోళన చెండాడు. ఈ క్రమంలోనే ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకున్నారు. రాత్రంతా మేల్కొని 800kms కారు నడిపారు. కొడుకు పరీక్ష సజావుగా రాశాకనే ఆ తండ్రి మనసు కుదుటపడింది. పిల్లల కోసం తండ్రి ఏ త్యాగానికైనా సిద్ధపడతారని ఈ ఘటనే నిరూపించింది.