చెన్నైలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి తన ముగ్గురు పిల్లలను హత్య చేశాడు. తంజావూరు జిల్లాలోని పట్టుక్కోట్టై తాలూకా గోపాలసముద్రం గ్రామానికి చెందిన S వినోద్ కుమార్, నిత్య దంపతులకు కుమార్తెలు వి. ఓవియా (12), కీర్తి, కుమారుడు వి ఈశ్వరన్ (5) ఉన్నారు. అయితే తన భార్య వేరే ఒక వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుని, అతడితో పారిపోయింది. ఇది భరించలేని భర్త వినోద్ ఆ కోపంతో ముగ్గురు బిడ్డలను అత్యంత పాశవికంగా హతమార్చాడు. అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.