అంబులెన్స్‌లో తండ్రి మృతదేహం.. యాక్సిడెంట్‌లో కొడుకు మృతి

51686చూసినవారు
అంబులెన్స్‌లో తండ్రి మృతదేహం.. యాక్సిడెంట్‌లో కొడుకు మృతి
ఒడిశాలోని మయూర్‌భంజ్‌లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఠకుర్‌ముండా సమితి మితువాని గ్రామానికి చెందిన గోపబంధు నాయక్(65) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మరణించాడు. మృతదేహాన్ని తన కొడుకు శుభ్‌నాయక్ అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్నాడు. మార్గమధ్యంలో కిందకి దిగిన శుభ్‌నాయక్‌ను ఓ వ్యాన్ ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స పొందుతూ అతడు కూడా మరణించాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్