అగ్ని ప్రమాదం.. వృద్ధురాలు సజీవదహనం

9488చూసినవారు
అగ్ని ప్రమాదం.. వృద్ధురాలు సజీవదహనం
విజయనగరం జిల్లా తెర్లాం మండలం కె.సీతాపురంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పాపమ్మ అనే వృద్ధురాలు సజీవదహనమైంది. చలి కోసం పెట్టుకున్న కుంపటి నుంచి నిప్పురవ్వలు ఎగసిపడి మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం జరిగిందని, ఈ ప్రమాదంలో 10 పూరిళ్లు దగ్ధమయ్యాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్