ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. 8కి చేరిన మరణాలు (వీడియో)

24407చూసినవారు
రాజస్థాన్‌లోని జైపూర్‌లో అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. సవాయి మాన్ సింగ్ ఆస్పత్రిలోని ఐసీయూ వార్డులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వేగంగా మంటలు వ్యాపించడంతో ఎనిమిది మంది పేషెంట్లు సజీవదహనం అయ్యారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు ఆస్పత్రి ట్రామా సెంటర్ ఇన్‌ఛార్జ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్