హైదరాబాద్లోని పాతబస్తీ బహదూర్పురా కిషన్బాగ్లో ఓ సోఫా తయారీ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మంటలు ఎగసిపడుతుండటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.