హైదరాబాద్ లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. చాదర్ ఘాట్ లోని విక్టోరియా గ్రౌండ్ లో ఈ కాల్పులు జరిగాయి. సౌత్ ఈస్ట్ డీసీపీ చైతన్య పై దొంగలు కత్తితో దాడికి యత్నించారు. ఈ మేరకు సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.