సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు తొలి పేపర్ లెస్ కేబినెట్ సమావేశం జరగనుంది. వీబీ జీరామ్జీ పథకం అమలుపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుంది. ఖరీఫ్ సీజన్లో విత్తనాలు, ఎరువుల పంపిణీపై చర్చించనున్నారు. ఎల్నినో పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై, ప్రత్యామ్నాయ పంటలకు ప్రోత్సాహకాలు ఇవ్వడంపై సమాలోచనలు, మూసీ తొలిదశ పనులకు ఆమోదం, మెట్రో విస్తరణ వంటి కీలక అంశాలపైన మంత్రివవర్గం చర్చించే అవకాశం ఉంది.