పారిస్లోని లూవ్రా మ్యూజియంలో ఈనెల 19న 102 మిలియన్ డాలర్ ల విలువైన ఆభరణాల చోరీ కేసులో పోలీసులు మరో ఐదుగురు అనుమానితులను అరెస్ట్ చేశారు. నెపోలియన్ కాలం నాటి తొమ్మిది అరుదైన ఆభరణాలను దొంగలు కేవలం ఏడు నిమిషాల్లోనే చోరీ చేశారు. ఆభరణాల విలువ 88 మిలియన్ యూరోలు (భారత కరెన్సీలో రూ.895 కోట్లు). ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు అనుమానితులను అరెస్ట్ చేయగా విచారణలో వారు నేరాన్ని అంగీకరించారు.