ఉత్తరప్రదేశ్లోని శ్రావస్తి జిల్లాలో గురువారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఒకే గదిలో సిరోజ్ అలీ, అతని భార్య, ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురి మృతదేహాలు లభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఇది సామూహిక ఆత్మహత్య అయి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.