బలవంతంగా అప్పు వసూలు చేస్తే ఐదేళ్లు జైలు శిక్ష పడేలా తమిళనాడు ప్రభుత్వం శాసనభలో బిల్లు ప్రవేశపెట్టింది. దీనికి గవర్నర్ ఆమోదం కూడా లభించింది. బలవంతంగా రుణాలు వసూలు, ఆస్తులను స్వాధీనం వంటి ఘటనలు ఆపడానికే ఈ బిల్లు ప్రవేశపెట్టామని TN ప్రభుత్వం పేర్కొంది. రుణసంస్థల ఒత్తిడితో ఎవరైనా బలవన్మరణానికి పాల్పడితే, ఆ సంస్థ నిర్వాహకులకు బెయిల్ రాకుండా జైలు శిక్ష అమలు చేసే విధంగా ఈ బిల్లును రూపొందించామని స్టాలిన్ ప్రభుత్వం తెలిపింది.