హైదరాబాద్లో భారీ వర్షాలతో మూసీ నది ఉగ్రరూపం దాల్చి చాదర్ఘాట్, పురానాపూల్, ఎంజీబీఎస్, ముసారాంబాగ్ వంటి ప్రాంతాలు నీటమునిగాయి. హైడ్రా, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ సంయుక్తంగా సహాయక చర్యలు చేపడుతున్నారు. శనివారం డ్రోన్ల ద్వారా ఆహారం, మంచినీరు అందజేస్తుండగా, హైడ్రా కమిషనర్ రంగనాథ్ వరద ప్రభావిత ప్రాంతాలను పర్యటించారు.